AP News: కృష్ణా జిల్లాలో అక్రమ సచివాలయ నిర్మాణం.. దళిత వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ABN , First Publish Date - 2022-08-19T16:07:03+05:30 IST

కృష్ణా జిల్లా, కీసరలో ఓ దళిత వ్యక్తి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు.

AP News: కృష్ణా జిల్లాలో అక్రమ సచివాలయ నిర్మాణం.. దళిత వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

కృష్ణా జిల్లా (Krishna Dist.): కీసరలో ఓ దళిత వ్యక్తి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు. తన భూమిలో సచివాలయం (Secretariat) కడుతున్నారని ఆవేదన చెందాడు. నిర్మాణం చేపట్టవద్దని అధికారులను వేడుకున్నాడు. తన భూమికి సంబంధించిన పత్రాలను చూపించాడు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. నిర్మాణ పనులు కొనసాగించారు. దీంతో ఆ భూమి వద్ద దళితుడి కుటుంబం నిరసన తెలిపింది. అయినా అధికారులు స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన దళితుడు చివరికి ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-19T16:07:03+05:30 IST