దారి దోపిడీపై పోలీసుల విచారణ

ABN , First Publish Date - 2022-05-26T03:33:26+05:30 IST

మండలంలోని ఓ పెట్రోల్‌ బంకు మేనేజర్‌పై రెండు రోజుల కిందట దాడి చేసి, సెల్‌ఫోన్‌ దోపిడీ చేయడంపై బుచ్చి సీఐ కోటేశ్వరరావు బుధ

దారి దోపిడీపై పోలీసుల విచారణ
సంఘటనా స్థలంలో బాధితుడిని విచారిస్తున్న పోలీసులు

సంగం, మే 25: మండలంలోని ఓ పెట్రోల్‌ బంకు మేనేజర్‌పై రెండు రోజుల కిందట దాడి చేసి, సెల్‌ఫోన్‌ దోపిడీ చేయడంపై బుచ్చి సీఐ కోటేశ్వరరావు బుధవారం విచారించారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో సంగం -కలిగిరి రహదారి మలుపులో ఉన పెట్రోలు బంకులో పనిచేసే మేనేజర్‌ మల్లికార్జున బహిర్భూమికని కలిగిరి రహదారిలోని ఆర్చి వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా సంగం వైపునుంచి రెండు మోటారు బైక్‌ల్లో ఐదుగురు యువకులు వచ్చి దాడి చేసి, జేబులో ఉన్న నగదు ఇవ్వమని బెదిరించారు. అతడి వద్ద నగదు లేకపోవడంతో జేబులోని మొబైల్‌ ఫోన్‌ తీసుకుని పరారయ్యారు. దాడిలో గాయపడిన మల్లికార్జున చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆత్మకూరు వైద్యశాలకు వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం బాధితుడిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి విచారించారు. ఈ విచారణంలో సీఐ వెంట ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, పోలీసులు ఉన్నారు.

Updated Date - 2022-05-26T03:33:26+05:30 IST