AP News : డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2022-08-05T22:30:57+05:30 IST

Amaravathi: ఏపీ ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆర్ధిక పర అంశాల‌పై ప్రభుత్వంలో ఎవ్వరూ స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులు

AP News : డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలి:  బొప్పరాజు వెంకటేశ్వర్లు

Amaravathi: ఏపీ ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆర్ధిక పర అంశాల‌పై ప్రభుత్వంలో ఎవ్వరూ స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు రూ. 3 వేల కోట్లు తిరిగి పొందడం కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన 7 వేల కోట్ల డీఏ (DA) బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్ధిక భద్రత కరువై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని బొప్పరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-05T22:30:57+05:30 IST