విద్యుత వైర్లు తగిలి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-10-23T08:17:54+05:30 IST
మండలంలోని కెఎ్సకొత్తూ రులో 11కేవీ విద్యుత వైర్లు తగిలి గురువారం వ్యక్తి మృతి చెందాడు.
కోటనందూరు, అక్టోబరు 22: మండలంలోని కెఎ్సకొత్తూ రులో 11కేవీ విద్యుత వైర్లు తగిలి గురువారం వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లగుడు బెన్నయ్యదొర(48) ఇంటివద్దకు కోతులు వచ్చి జామచెట్టు కాయలు తినడంతో పక్కన ఉన్న లగుడు పైడిరాజు ఇంటిపైకి వెళ్లాడు. కోతులను కొడుతుండగా 11కెవి విద్యుతవైర్లు తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్ఐ అశోక్ తెలిపారు.