ఒకరితో నిశ్చితార్థం.. మరొకరిని పెళ్ళాడిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌

ABN , First Publish Date - 2021-04-17T05:20:51+05:30 IST

ఒకరితో పెళ్ళి నిశ్చయం చేసుకొని మరొకరిని మనువాడిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌పై శుక్రవారం మహానంది పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమో దైంది.

ఒకరితో నిశ్చితార్థం.. మరొకరిని పెళ్ళాడిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌

  1. మహానంది పోలీస్టు స్టేషన్‌లో కేసు నమోదు


మహానంది, ఏప్రిల్‌ 16: ఒకరితో పెళ్ళి నిశ్చయం చేసుకొని మరొకరిని మనువాడిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌పై శుక్రవారం మహానంది పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమో దైంది. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాలివి.. మహానంది మండలం ఓ గ్రామానికి చెందిన యువతితో శిరివెళ్ల మండలం గుంపరమానిదెన్నె గ్రామానికి చెందిన బత్తుల పుల్లయ్య కుమారుడు జమ్ము కాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవానుగా పనిచేస్తున్న మధుభాస్కర్‌తో వివాహం నిశ్చయం అయింది. వీరికి రూ.7.50లక్షల కట్నంతో ఒప్పందం కుదిరింది. వీరి ఇద్దరికి ఈఏడాది జనవరి 16వ తేదీన పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. అయితే అదనపు కట్నాన్ని ఆశించిన మధుభాస్కర్‌ బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన యువతితో ఈనెల 15వ తేదీన వివాహం జరిగింది. సమాచారం తెలుసుకొన్న నిశ్చితార్థం అయిన యువతి తండ్రి తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని మహానంది పోలీ్‌స స్టేషన్‌లో మధుభాస్కర్‌, అతని తండ్రి పుల్లయ్యపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   


Updated Date - 2021-04-17T05:20:51+05:30 IST