రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-20T05:13:52+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు తరలివచ్చారు

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ, ఆగస్టు 19 :  వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం  భక్తులతో సందడిగా మారింది. శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడకు తరలివచ్చారు.  తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని కోడెమొక్కు చెల్లించుకున్నారు. ప్రధాన ఆలయంలో  స్వామివారి అభిషేక పూజ, అన్నపూజ, బాలాత్రిపురాసుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమపూజ, కళాభవన్‌లో  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించడంతో పాటు ఆలయ ఆవరణలో నిలువెత్తు బెల్లం పంచారు.  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-08-20T05:13:52+05:30 IST