భీమవరంలో హస్తకళల ప్రదర్శన ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-13T05:44:15+05:30 IST

పట్ణణం లోని నటరాజ్‌ థియటర్‌ సమీపంలో ఆల్‌ ఇండియా క్రాఫ్ట్‌ బజార్‌–2021 హస్తకళ ల, చేతన ఎంపోరియం ఎగ్జిబిషన్‌ను సోమవా రం ఎమ్మెల్యే తనయుడు గ్రంధి రవితేజ ప్రారంభించారు.

భీమవరంలో హస్తకళల ప్రదర్శన ప్రారంభం

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 12 : పట్ణణం లోని నటరాజ్‌ థియటర్‌ సమీపంలో  ఆల్‌ ఇండియా క్రాఫ్ట్‌ బజార్‌–2021 హస్తకళ ల, చేతన ఎంపోరియం ఎగ్జిబిషన్‌ను సోమవా రం ఎమ్మెల్యే తనయుడు గ్రంధి రవితేజ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత, హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్‌ నసీమ్‌ మాట్లాడుతూ ఈ ప్రదర్శన వచ్చేనెల 16 వరకు ఉంటుం దన్నారు. హైదరాబాద్‌ ముత్యాలు, కలంకారి పెయింటింగ్స్‌, మార్బల్‌ బొమ్మలు, దివాన్‌ కాట్స్‌ తదితర వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతీ రోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు.

Updated Date - 2021-04-13T05:44:15+05:30 IST