హోటల్లో మసాజ్ సెంటర్.. నిర్వాహకుల అరెస్ట్
ABN , First Publish Date - 2022-08-08T05:55:50+05:30 IST
గుట్టుగా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ హోటల్పై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
ఖైరతాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): గుట్టుగా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ హోటల్పై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. లక్డీకాపూల్లోని సెంట్ హోటల్లో క్రాస్డ్ మసాజ్ నిర్వహిస్తున్నారని సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందింది. దాడిచేయగా ముగ్గురు యువతులు ఓ వ్యక్తికి మసాజ్ చేస్తుండడం గుర్తించారు. సోమర వెల్నెస్ స్పా పేరుతో సెంటర్ నిర్వహిస్తున్న సౌరబ్కుమార్, మేనేజర్ ఇజుంగ్ ఓతుంగ్లోను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.