కిడ్నాప్ కేసులో 9 మంది అరెస్టు
ABN , First Publish Date - 2020-12-06T05:39:48+05:30 IST
ఆర్థిక లావా దేవీల విషయంలో తాడేప ల్లిగూడెంకు చెందిన ఓ కు టుంబాన్ని కిడ్నాప్ చేసేం దుకు ప్రయత్నించిన తొమ్మి ది మందిని అరెస్టు చేశామ ని పట్టణ సీఐ ఆకుల రఘు శనివారం తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 5 : ఆర్థిక లావా దేవీల విషయంలో తాడేప ల్లిగూడెంకు చెందిన ఓ కు టుంబాన్ని కిడ్నాప్ చేసేం దుకు ప్రయత్నించిన తొమ్మి ది మందిని అరెస్టు చేశామ ని పట్టణ సీఐ ఆకుల రఘు శనివారం తెలిపారు. తాడే పల్లిగూడెం కొండయ్య చెరు వుకు చెందిన భర్త శివ ప్ర సాద్, భార్య, పాప, మరో వ్యక్తిని కిడ్నాప్ చేయగా వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన ఘటనపై ఎస్పీ నారా యణ నాయక్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేశామన్నారు. ధర్మాజిగూడెంకు చెందిన పొలిమేర రాజేష్, తనగాల శ్రీధర్బాబు, హైదరాబా ద్కు చెందిన సీతారామకృష్ణ, కొంకుముడుసు మధుబాబు, కొంకుముడుసు అపర్ణవాణి, ఏలూరుకు చెందిన దాససరి కుమార్రాజా, దాసరి శాంతారావు, దాసరి అశోక్, మింగి శ్రీనులను అరెస్టు చేశామని సీఐ ఆకుల రఘు తెలిపారు. వారి నుంచి రెండు కార్లు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.