పట్టపగలే అశ్లీల నృత్యాలు : ఐదుగురి అరెస్ట్
ABN , First Publish Date - 2020-12-06T05:36:06+05:30 IST
కరోనా విజృంభిస్తున్న సమయంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో కార్తీక వన భోజనాల పేరిట పట్టపగలే ఆశ్లీల నృత్యాలు నిర్వహించారు.
దేవరపల్లి, డిసెంబరు 5 : కరోనా విజృంభిస్తున్న సమయంలో కార్తీక వన భోజనాల పేరిట పట్టపగలే ఆశ్లీల నృత్యాలు నిర్వహించారు. మండలంలోని లక్ష్మీపురం శివారు పొలాల్లో కార్తీక వనభోజనాల సందర్భంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్న వారితో పాటు నిర్వాహకులను మొత్తం ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్ఐ స్వామి తెలిపారు. వనభోజనాల పేరిట అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చాగల్లు పోలీసులు దాడి చేసి దేవరపల్లి పరిధిలో ఉండడంతో దేవరపల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్టు తెలిపారు. చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన అశ్లీల నృత్య ప్రదర్శన నిర్వాహకులు పెనుబోయిన రాంబాబు, టేకు సత్తిబాబు, నృత్య ప్రదర్శన చేసిన మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.