గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం స్వాధీనం
ABN , First Publish Date - 2020-11-25T04:56:50+05:30 IST
ఏలూరు శివారు దొండపాడు సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలో సుమారు 60 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వృద్ధురా లి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు.
ఏలూరు క్రైం, నవంబరు 24: ఏలూరు శివారు దొండపాడు సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలో సుమారు 60 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వృద్ధురా లి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందు కున్న సీఐ మూర్తి ఆదేశాల మేరకు ఎస్ఐ వెంకట రమణ తన సిబ్బందితో వెళ్లి వివరాలు నమోదు చేసుకుని బాగా పాడై ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.