క్రికెట్‌ విజేతగా ఖమ్మం పోలీస్‌ జట్టు

ABN , First Publish Date - 2021-01-25T04:24:24+05:30 IST

కల్లూరులో అమరవీరుల క్రికెట్‌ టోర్నీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాల స్థాయిలో మూడోరోజైన ఆదివారం జరిగిన క్రికెట్‌ టోర్నీలో ఖమ్మం పోలీస్‌ జట్టు విజేతగా నిలిచింది.

క్రికెట్‌ విజేతగా ఖమ్మం పోలీస్‌ జట్టు
పోలీస్‌ జట్టుకు బహుమతి అందజేస్తున్న దృశ్యం

కల్లూరు, జనవరి 24: కల్లూరులో అమరవీరుల క్రికెట్‌ టోర్నీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాల స్థాయిలో మూడోరోజైన ఆదివారం జరిగిన క్రికెట్‌ టోర్నీలో ఖమ్మం పోలీస్‌ జట్టు విజేతగా నిలిచింది. ఈజట్టులో సత్తుపల్లి రూరల్‌, వైరా, జూలూరుపాడు, మధిర సీఐలు కరుణాకర్‌, వసంతకుమార్‌, నాగరాజు, మురళీ, కల్లూరు, వేంసూరు, ఏన్కూరు, జూలూరుపాడు ఎస్‌ఐలు రఫి, సాయికుమార్‌, శ్రీకాంత్‌, శ్రీకాంత్‌, నాగరాజు, కానిస్టేబుళ్లు నర్సింహారావు, అశోక్‌, రాజా, రమే్‌ష పాల్గొన్నారు. మ్యాన్‌ఆ్‌ఫది మ్యాచ్‌గా జూలూరుపాడు సీఐ నాగరాజు బహుమతి పొందారు. రైతుబంధు ప్రతినిధులు పసుమర్తి చంద్రరావు, డాక్టర్‌ లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణ్‌రావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కల్యాణ్‌కిషోర్‌, పెడకంటి రామకృష్ణ, బొల్లం శంకర్‌, మాధవ్‌, కొరకొప్పు ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T04:24:24+05:30 IST