సచిన్, విరాట్ల కన్నా ధోనీకి అధిక ప్రజాదరణ: సునీల్ గవాస్కర్
ABN , First Publish Date - 2020-09-20T16:41:49+05:30 IST
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ తాజాగా మహేంద్ర సింగ్ ధోనీని అభినందనలతో ముంచెత్తారు. రెండుసార్లు ప్రపంచ కప్ను సాధించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశంలో ప్రజాదరణ పొందే విషయంలో సచిన్...
అబుధాబీ: భారత క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ తాజాగా మహేంద్ర సింగ్ ధోనీని అభినందనలతో ముంచెత్తారు. రెండుసార్లు ప్రపంచ కప్ను సాధించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశంలో ప్రజాదరణ పొందే విషయంలో సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీలను వెనక్కి నేట్టేశారని అన్నారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ గవాస్కర్ 13వ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు సంబంధించిన కామెంట్రీ కోసం యూఏయీలో ఉన్నారు. కాగా ధోనీ ఇటీవలే తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.