8 మంది బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌.. నిందితుల్లో నలుగురు వలంటీర్లు

ABN , First Publish Date - 2020-10-21T19:00:59+05:30 IST

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని అరె్‌స్ట చేసి, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్‌ బాషా..

8 మంది బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌.. నిందితుల్లో నలుగురు వలంటీర్లు

హిందూపురం: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని అరె్‌స్ట చేసి, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్‌ బాషా తెలిపారు. పట్టుబడిన వారిలో నలుగురు గ్రామ, వార్డు వలంటీర్లున్నారన్నారు. అరెస్ట్‌ వివరాలను మంగళవారం వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఆయన వెల్లడించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం రావటంతో వన్‌టౌన్‌ సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐలు శేఖర్‌, కరీం, కానిస్టేబుల్‌ నరేష్‌, అనిల్‌ బృందాలుగా విడిపోయి నిఘా పెట్టారు. ఆర్టీసీ బస్టాండు వద్ద బెట్టింగ్‌ ఆడుతుండగా వీవర్స్‌ కాలనీ, మోడల్‌ కాలనీలకు  చెందిన వలంటీర్లు బోయ నవీన్‌, ఇల్లూరి విజయ్‌కుమార్‌, పల్లవారి మహేష్‌, భానుప్రకాశ్‌, నేత కార్మికులు కె.ఎస్‌. ప్రదీప్‌, కుమ్మర లోకేష్‌, చెన్న నవీన్‌కుమార్‌, మాల హరీష్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.88 వేల నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐలు బాలమద్దిలేటి, ధరణికిషోర్‌, ఎస్‌ఐ శేఖర్‌, కరీం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-21T19:00:59+05:30 IST