సీఆర్డీఏ భూముల్లో మట్టి తవ్వకాలు

ABN , First Publish Date - 2022-07-01T05:31:49+05:30 IST

రాజధాని ప్రాంతంలో రైతుల ఇచ్చిన సీఆర్డీఏ భూముల్లో యథేచ్ఛగా మట్టి దోపిడి సాగుతోంది. అనంతవరంలో ల్యాండు ఫూలింగ్‌కి రైతులు భూములు ఇచ్చారు.

సీఆర్డీఏ భూముల్లో మట్టి తవ్వకాలు
అనంతవరంలోని సీఆర్డీఏ భూమిలో మట్టి తవ్విన ప్రదేశం

తుళ్లూరు, జూన్‌ 30 : రాజధాని ప్రాంతంలో  రైతుల ఇచ్చిన సీఆర్డీఏ భూముల్లో యథేచ్ఛగా మట్టి దోపిడి సాగుతోంది. అనంతవరంలో ల్యాండు ఫూలింగ్‌కి రైతులు భూములు ఇచ్చారు. ఆ భూముల్లో గురువారం పట్టగలే జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఈవిషయాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రెవెన్యూ అధికారులకు పోలీసులసాయంతో ఘటనా ప్రదేశా నికి చేరుకోగా అప్పటికే సదురు వ్యక్తులు ఉడాయించారు.  మట్టితో నింపిన రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సర్వేరు, వీఆర్వో మట్టి తవ్విన ప్రదేశాన్ని పరిశీలించి ఆ ప్రాంతం రాజధాని నిర్మాణం కోసం అనతంవరం  రైతులిచ్చిన రెవెన్యూ  భూమి అని స్పష్టం చేశారు. అయితే వడ్డమాను గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత ఒకరు ఈ మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతు న్నాడని, తవ్విన మట్టిని ఓ ప్రయివేటు ప్రదేశానికి తరలిస్తున్నాడని స్థానిక గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. 


Updated Date - 2022-07-01T05:31:49+05:30 IST