టిడ్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T05:20:27+05:30 IST

పట్టణ పేదలకు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని సీపీఎం కార్యదర్శి జవ్వాది శ్రీనివాసావు డిమాండ్‌ చేశారు.

టిడ్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి
పాలకొల్లులో వినతిపత్రం ఇస్తున్న సీపీఎం నేతలు

పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 29: పట్టణ పేదలకు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని సీపీఎం కార్యదర్శి జవ్వాది శ్రీనివాసావు డిమాండ్‌ చేశారు. ఇంటింటికి సీపీఎం కార్యక్రమంలో బుధవారం పట్టణంలోని 23, 24, 28, 29, 30, 31 వార్డు సచివాలయాల వద్ద ధర్నా అనంతరం కార్యదర్శులకు వినతి పత్రాలను అం దజేశారు. వార్డు పర్యటనలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వివరించారు. విద్యుత్‌ బిల్లుతో ముడిపెట్టి సంక్షేమ పథకాలను రద్దు చేయడం సరి కాదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గుబ్బల సత్యనారాయణ, కౌరు లక్ష్మీనారాయణ, జొన్నల నరసింహమూర్తి, తాడి వెంకటేష్‌, జి వీరాస్వామి, పి సత్యనారాయణ, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:20:27+05:30 IST