పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-02-27T04:55:07+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

వేలేరుపాడు, ఫిబ్రవరి 26 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి ఎస్‌.సాయిబాబు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వల్ల సామాన్యప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీటి పెరుగుదల కారణంగా వ్యవసాయ రంగంలో ఖర్చులు పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


చింతలపూడిలో లారీల బంద్‌ ..

చింతలపూడి, ఫిబ్రవరి 26 : పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ చింతలపూడి లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు వై.సత్యనారా యణమూర్తి మాట్లాడుతూ ఆలిండియా లారీ ట్రాన్స్‌పోర్టు పిలుపు మేరకు శుక్రవారం చింతలపూడి పట్టణంలో లారీలను బంద్‌ చేశామన్నారు. ధర్నాలో అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ సత్యనారాయణ, వైఎస్‌ఆర్‌ కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:55:07+05:30 IST