కరోనా కేసులలో ఏపీ రెండో స్థానానికి చేరడమే ఆదర్శమా?: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-10-01T15:17:54+05:30 IST

కరోనా కేసులలో ఏపీ రెండో స్థానానికి చేరడమే ఆదర్శమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు.

కరోనా కేసులలో ఏపీ రెండో స్థానానికి చేరడమే ఆదర్శమా?: రామకృష్ణ

అమరావతి: కరోనా కేసులలో ఏపీ రెండో స్థానానికి చేరడమే ఆదర్శమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. కరోనా కట్టడిలో సీఎం జగన్‌ దేశానికే ఆదర్శం అని చెప్పటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఎంతమందికి కరోనా వైద్యం అందించారని ప్రశ్నించారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు రూ.2 వేల సాయం ఎంతమందికి ఇచ్చారని.. చనిపోయిన కరోనా రోగుల అంత్యక్రియల నిమిత్తం రూ.15 వేలు ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. రాష్ట్రంలో కరోనా వైద్యానికి అన్ని సౌకర్యాలు కల్పించి ఉంటే... వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లారని రామకృష్ణ ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-01T15:17:54+05:30 IST