గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళన చేస్తున్నాం: బాబూరావు
ABN , First Publish Date - 2021-04-22T17:39:00+05:30 IST
కోవిడ్ పేషెంట్లకు సహాయ చర్యలు అందించటంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయంటూ సీపీఎం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టింది.
విజయవాడ: కోవిడ్ పేషెంట్లకు సహాయ చర్యలు అందించటంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆపార్టీ నేత బాబూరావు మాట్లాడుతూ కనీసం ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు బెడ్లు దొరకటం లేదని మండిపడ్డారు. గతంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్స్ను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కూడా దొరకని పరిస్ధితి నెలకొందన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో తాము ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలకు ముందున్న నాయకులు ఇప్పుడు ఎక్కడకి వెళ్లారని బాబూరావు ప్రశ్నించారు.