సచివాలయాన్ని కూల్చివేయడం శోచనీయం : సీపీఐ
ABN , First Publish Date - 2020-07-10T11:38:44+05:30 IST
సచివాలయాన్ని కూల్చివేయడం శోచనీయమని సీపీఐ జిల్లా కార్యాదర్శి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం
గద్వాల టౌన్, జూలై 9 : సచివాలయాన్ని కూల్చివేయడం శోచనీయమని సీపీఐ జిల్లా కార్యాదర్శి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో కొత్త సెక్రటేరియట్ భవన నిర్మానానికి రూ.500 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడడం అసమంజసమన్నారు. అనంతరం ఆయన రిక్షా కార్మికులకు, చిరువ్యాపారులకు, పాత్రికేయులకు హమియోపతి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు గోపాల్ రావు, చన్నయ్య, సురేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.