ముగిసిన గోవిందుడి తెప్పోత్సవాలు
ABN , First Publish Date - 2021-02-27T08:03:16+05:30 IST
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.
తిరుపతి(కల్చరల్), ఫిబ్రవరి 26: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజున పుష్కరిణిలోని తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఏడు పర్యాయాలు విహరించారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన సంగీత కార్యక్రమం అలరించింది. టీటీడీ ఈవో జవహర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా, జీయర్ స్వాములు, ఆలయ ప్రధానార్చకుడు శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్రెడ్డి, సూపరింటెండెంట్లు వెంకటాద్రి, రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కామరాజు, మునీంద్రబాబు, సిబ్బంది, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.