అసోంలో 1500 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-06-03T01:01:46+05:30 IST
అసోంలో ఇవాళ మరో 28 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. తాజా కేసులతో కలిపి...
గువహటి: అసోంలో ఇవాళ మరో 28 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1513కు చేరినట్టు అసోం ఆరోగ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. కొత్తగా నమోదైన 28 కేసుల్లో ఐదుగురు విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా.. నాగాన్లో 12 మంది, గోలాఘాట్లో 10 మంది, జోర్హాట్ జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా బాధితులను గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. మరోవైపు ఇవాళ కరోనా మహమ్మారిని జయించి కోలుకున్న 40 మందిని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,182 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతుండగా... ఇప్పటి వరకు ఈ వ్యాధి నుంచి 324 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.