హిమాచల్ ప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-06T01:53:02+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

హిమాచల్ ప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

సిమ్లా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు కొత్తగా మరో 6 కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 390 కరోనా కేసులు నమోదైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు.


Updated Date - 2020-06-06T01:53:02+05:30 IST