కొత్తగా 112 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-28T05:18:49+05:30 IST
జిల్లాలో కొత్తగా 112 మందికి కరోనా వైరస్ సోకింది.
గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 112 మందికి కరోనా వైరస్ సోకింది. శుక్రవారం ఉదయం వరకు అందిన 4,058 ఫలితాల్లో గుంటూరు నగరంలో 45, తాడేపల్లిలో 11, మంగళగిరిలో 5, నరసరావుపేటలో 6, కొల్లూరులో 6, తెనాలిలో 6 పాజిటివ్ కేసులు వచ్చాయి. మిగిలిన మండలాల్లో మరో 33 మందికి పాజిటివ్ వచ్చింది. బాధితుల సంఖ్య 74,297కి చేరింది. శుక్రవారం మరో 2,531 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు.