నేటి నుంచి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-16T06:05:05+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం నుంచి మొదలు కానుంది. వ్యాక్సినేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నేటి నుంచి వ్యాక్సినేషన్‌

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 15: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం నుంచి మొదలు కానుంది. వ్యాక్సినేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు 2700 మందికి టీకా వేయనున్నారు. టీకా తీసుకున్న తర్వాత ప్రతికూలత ఘటనలు కనిపిస్తే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పది పడకలను సిద్ధం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అదే ఆసుపత్రిలో అరగంట వరకు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. ఆ సమయంలో ప్రతికూల ఘటనలు చోటుచేసుకుంటే చికిత్సపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 


పడకలు సిద్ధం చేశాం

కొవిడ్‌ టీకా తీసుకున్న వారిలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తే చికిత్స అందించేందుకు కర్నూలు జీజీహెచ్‌లో పది పడకలు ఏర్పాటు చేశాం. ఈ వార్డులో వారిని నిపుణులు పర్యవేక్షిస్తారు. - డా.జి.నరేంద్రనాథరెడ్డి, సూపరింటెండెంట్‌, కర్నూలు జీజీహెచ్‌


ఒక కేసు

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కనిష్ఠ స్థాయికి చేరింది. శుక్రవారం ఒక కేసు నమోదైంది. దీంతో బాధితుల సంఖ్య 60,715కు చేరింది. ఇందులో 101 యాక్టివ్‌ కేసులు కాగా 60,127 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2021-01-16T06:05:05+05:30 IST