కరోనాకు సీనియర్‌ నటుడు బలి

ABN , First Publish Date - 2021-05-08T17:19:00+05:30 IST

శాండల్‌వుడ్‌లో సీనియర్‌ నటుడిగా పేరొందిన శంఖనాద అరవింద్‌ కొ విడ్‌కు బలి అయ్యారు. సుమారు 250కుపైగా సినిమాలలో అరవింద్‌ నటించారు. 70ఏళ్ల అరవింద్‌ వారం క్రితం కొవిడ్‌తో

కరోనాకు సీనియర్‌ నటుడు బలి


బెంగళూరు: శాండల్‌వుడ్‌లో సీనియర్‌ నటుడిగా పేరొందిన శంఖనాద అరవింద్‌ కొ విడ్‌కు బలి అయ్యారు. సుమారు 250కుపైగా సినిమాలలో అరవింద్‌ నటించారు. 70ఏళ్ల అరవింద్‌ వారం క్రితం కొవిడ్‌తో విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో శుక్రవారం తుదిశ్వాస వీడారు. పునీత్‌రాజ్‌కుమార్‌ బాల్యంలో నటించిన ‘బెట్ట దహూవు’లో కీలకపాత్ర పోషించారు. ప్రముఖ నటుడు కాశీనాథ్‌కు ఆప్తుడు. అరవింద్‌కు ఇరువురు కుమా ర్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బెంగళూరులోనే కరోనా నిబంధనలతో అంత్యక్రియలు జరిపారు. 


Updated Date - 2021-05-08T17:19:00+05:30 IST