Covid: పోలీసుల శిక్షణ కేంద్రంలో 29 మందికి కరోనా
ABN , First Publish Date - 2022-08-04T16:59:16+05:30 IST
పుదుచ్చేరి పోలీసు శిక్షణా కేంద్రంలో 29 మందికి కరోనా పాజిటివ్(Corona positive) నిర్ధారణ అయింది. ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 100 మంది పోలీ
పుదుచ్చేరి, ఆగస్టు 3: పుదుచ్చేరి పోలీసు శిక్షణా కేంద్రంలో 29 మందికి కరోనా పాజిటివ్(Corona positive) నిర్ధారణ అయింది. ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 100 మంది పోలీసులకు కరోనా సోకినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై ఆరోగ్యశాఖ డైరెక్టర్ డా.శ్రీరాములు విడుదల చేసిన ప్రకటనలో, గత నెల 31వ తేదీ ఆరుగురికి పాజిటివ్(Positive) నిర్ధారణ కాగా, బుధవారం ఒకేరోజు 29 మందికి సోకిందని, కేంద్రంలోని అందరికీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.