Covid: మరోసారి పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-08-19T17:26:00+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసారి పెరిగాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 2329 మందికి పాజిటివ్(Positive) నిర్ధారణ అయింది. బెం
బెంగళూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసారి పెరిగాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 2329 మందికి పాజిటివ్(Positive) నిర్ధారణ అయింది. బెంగళూరులో 1606, మైసూరు 168, రాయచూరు58, రామనగర్, ధార్వాడలలో 48 చొప్పున, హాసన్ 47, బళ్లారిలో 44 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, బీదర్(Bidar) మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 40 మంది లోపు బాధితులు నమోదయ్యారు. 1782 మంది కోలుకోగా, గడిచిన 24 గంటల్లో నలుగురు మృతిచెందారు. బెంగళూరు గ్రామీణ, ధార్వాడ, కావేరి, కొప్పళ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ప్రస్తుతం 9307 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 6534 మంది ఉన్నారు.