భారీగా పెరిగిన Covid కేసులు
ABN , First Publish Date - 2022-07-21T17:09:49+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు అధికమవుతున్నాయి. బుధవారం 1,478 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరు లో 1521, బెంగళూరు గ్రామీణ 32,
- 1478 మందికి పాజిటివ్
బెంగళూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు అధికమవుతున్నాయి. బుధవారం 1,478 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరు లో 1521, బెంగళూరు గ్రామీణ 32, మైసూరు 24, ధారవాడ 18, బెళగావి, బాగల్కోటె 15 చొప్పున, కోలారు 13, బళ్లారిలో 12, ఉత్తరకన్నడలో 10 మందికి కొ విడ్ ప్రబలింది. 18 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు కాగా 3 జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. 1229 మంది కోలుకోగా 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. 7866 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 7064 మంది ఉన్నారు.