617 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-28T17:57:31+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. సోమవారం 617 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 592 మందికి సోకగా
బెంగళూరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. సోమవారం 617 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 592 మందికి సోకగా దక్షిణకన్నడలో ఏడుగురు, మైసూరులో నలుగురు, బళ్లారి, ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాల్లో ముగ్గురు చొప్పున నమోదయ్యారు. ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 767 మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. 4288 మంది చికిత్సలు పొందుతుండగా 4088 మంది బెంగళూరులోనే ఉన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 200 మంది ఉన్నారు.