Bengaluruకు కొవిడ్‌, ఒమైక్రాన్‌ డబుల్‌ షాక్‌

ABN , First Publish Date - 2022-01-04T17:21:31+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు వరుసగా 8వ రోజు పెరిగాయి. ప్రత్యేకించి బెంగళూరుకు కొవిడ్‌తోపాటు ఒమైక్రాన్‌ కూడా తోడై డబుల్‌ షాక్‌ ఇస్తోంది. సోమవారం 1,290 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 1,041 మందికి,

Bengaluruకు కొవిడ్‌, ఒమైక్రాన్‌ డబుల్‌ షాక్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు వరుసగా 8వ రోజు పెరిగాయి. ప్రత్యేకించి బెంగళూరుకు కొవిడ్‌తోపాటు ఒమైక్రాన్‌ కూడా తోడై డబుల్‌ షాక్‌ ఇస్తోంది. సోమవారం 1,290 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 1,041 మందికి, దక్షిణకన్నడలో 52 మంది, ఉడుపిలో 43 మందికి వైరస్‌ సోకింది. నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 220 మంది కోలుకోగా ఐదుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు బెంగళూరు వాసులు కాగా మిగిలిన ఇద్దరు చిత్రదుర్గ, హాసన్‌లకు చెందినవారు. 30 జిల్లాల్లో 11,345 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 9,575మంది ఉన్నారు. 

Updated Date - 2022-01-04T17:21:31+05:30 IST