బాధితులకు కొవిడ్‌ కిట్లు సకాలంలో అందజేయాలి

ABN , First Publish Date - 2020-08-07T11:35:47+05:30 IST

కొవిడ్‌ బాధితులకు సకాలంలో కిట్లు అందజేయాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌, నగరపాలక కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ చెప్పారు.

బాధితులకు కొవిడ్‌ కిట్లు సకాలంలో అందజేయాలి

సబ్‌కలెక్టర్‌, నగరపాలక కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌


రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 6:  కొవిడ్‌ బాధితులకు సకాలంలో కిట్లు అందజేయాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌, నగరపాలక కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ చెప్పారు. ఆయన కొవిడ్‌ ఆసుపత్రులు, కంట్రోల్‌ రూముల ప్రత్యేక అధికారి ఆనంద్‌తో కలిసి గురువారం రాత్రి కార్పొరేషన్‌ కార్యాలయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చేపట్టే చర్యలపై  సమీక్షించారు.  కంట్రోల్‌ రూమ్‌లోని వివిధ విభాగాల్లోని  వైద్యాధికారులతో సమావేశమై కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది అవసరాలను తెలుసుకుని వాటిని తీర్చాలని కంట్రోల్‌ రూమ్‌లు సత్వర సమాచార సేకరణ వంటివి వేగవంతంగా చేయాలని పలు ఆదేశాలిచ్చారు.

Updated Date - 2020-08-07T11:35:47+05:30 IST