రాష్ట్రంలో పెరిగిన Covid డిశ్చార్జ్లు
ABN , First Publish Date - 2022-01-29T13:11:34+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రెండు రోజులతో పోలిస్తే తగ్గగా డిశ్చార్జ్లు పెరగడం ఊరటనిచ్చే అంశం. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 31,198 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 71,092 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒ
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు రెండు రోజులతో పోలిస్తే తగ్గగా డిశ్చార్జ్లు పెరగడం ఊరటనిచ్చే అంశం. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 31,198 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 71,092 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క బెంగళూరులోనే 44,866 మంది కోలుకున్నారు. బెంగళూరులో 15,199 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 50 మంది మృతిచెందారు. బెంగళూరు, మైసూరులో 8 మంది చొప్పున, హాసన్లో 5, తుమకూరు, దక్షిణకన్నడలో 4 చొప్పున, బెళగావి, శివమొగ్గలలో 3 చొప్పున, హావేరి, రామగనరలలో 2 చొప్పున, 11 జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 2,88,767మంది చికిత్స పొందుతున్నారు.