కొవిడ్ నియంత్రణా చర్యలు శూన్యం
ABN , First Publish Date - 2020-08-07T11:36:44+05:30 IST
ఉద్యోగులకు వైరస్ సోకినా ఓఎన్జీసీ సంస్థ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని గ్రామస్థులు గురువారం ఆర్డీవో ..
ఓఎన్జీసీపై ఆర్డీవోకు స్థానికుల ఫిర్యాదు
ఉప్పలగుప్తం, ఆగస్టు 6: ఉద్యోగులకు వైరస్ సోకినా ఓఎన్జీసీ సంస్థ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని గ్రామస్థులు గురువారం ఆర్డీవో వసంతరాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ నెల2న జగ్గరాజుపేట ఓఎన్జీసీ సైట్ వద్ద ఆందోళన చేయగా కరోనా నియంత్రణ చర్యలు చేపడతామని ఇచ్చిన హామీని ఐ.ఎం, ఏరియా మేనేజర్లు విస్మరించారని జనసేన నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆర్డీవోకు వివరించారు. ఆర్డీవో సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.