ఐదుగురు మృతి
ABN , First Publish Date - 2021-07-25T06:05:42+05:30 IST
జిల్లాలో కరోనా బారినపడిన మరో ఐదుగురు బాధితులు శనివారం మరణించారు
కొత్తగా 248 మందికి కరోనా వైరస్
విజయవాడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా బారినపడిన మరో ఐదుగురు బాధితులు శనివారం మరణించారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 248 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,07,070కి చేరాయి.. మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,183కు పెరిగాయి. వైరస్ బారిన పడివారిలో ఇప్పటి వరకు 1,03,218 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా 2,669 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.