కొవిడ్‌ కేసులు 120

ABN , First Publish Date - 2021-10-20T07:42:11+05:30 IST

జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ మరణాలేవీ నమోదు కాలేదు.

కొవిడ్‌ కేసులు 120

తిరుపతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ మరణాలేవీ నమోదు కాలేదు. అయితే అదే సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 120 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 245956కు పెరిగింది. మంగళవారం ఉదయానికి జిల్లాలో 945 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు వున్నట్టు ప్రభుత్వ అధికారిక బులెటిన్‌ వెల్లడించింది. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 26, చిత్తూరులో 11, పీలేరు, పెనుమూరు మండలాల్లో 7 చొప్పున, మదనపల్లెలో 6, పూతలపట్టులో 5, చంద్రగిరిలో 4, తిరుపతి రూరల్‌, పుత్తూరు, పుంగనూరు, సదుం, రేణిగుంట, పాకాల, గుర్రంకొండ మండలాల్లో 3 వంతున,  కేవీపల్లె, వాల్మీకిపురం, బంగారుపాలెం, ఐరాల, పులిచెర్ల, తొట్టంబేడు, చౌడేపల్లె, తవణంపల్లె, కురబలకోట, వరదయ్యపాలెం మండలాల్లో 2 చొప్పున, శ్రీకాళహస్తి, పలమనేరు, నగరి, కుప్పం, రామకుప్పం, ఏర్పేడు, శ్రీరంగరాజపురం, కలకడ, కలికిరి, రామచంద్రాపురం, రొంపిచెర్ల, సోమల మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-20T07:42:11+05:30 IST