15 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-25T06:00:14+05:30 IST

జిల్లాలో ఆదివారం ఉదయం వరకు 2,912 శాంపిల్స్‌ ఫలితాలు విడుదల కాగా అందులో 15 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.

15 మందికి కరోనా


గుంటూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం ఉదయం వరకు 2,912 శాంపిల్స్‌ ఫలితాలు విడుదల కాగా అందులో 15 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. మిగిలిన 2,897(99.48 శాతం) మందికి నెగెటివ్‌గా నిర్ధారణ జరిగినట్లు ఆమె చెప్పారు. గుంటూరు నగరంలో 7, తాడేపల్లిలో 4, దాచేపల్లిలో 2, నాదెండ్ల, కొల్లిపరలో ఒక్కో కేసు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 77,017 మంది కరోనా వైర స్‌ బారిన పడగా వారిలో 76,093 మంది(98.80 శాతం) మంది కోలుకున్నారు.   కాగా ఆదివారం 2,845 మంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 


Updated Date - 2021-01-25T06:00:14+05:30 IST