కరోనాను ఓడించిన కవల శిశువులు
ABN , First Publish Date - 2020-05-30T12:50:34+05:30 IST
గుజరాత్లో మే 16 న జన్మించిన కవల శిశువులు కరోనాను ఓడించారు. వీరు మన దేశంలో మొట్టమొదటి కరోనా సోకిన కవల శిశువులు.
గాంధీనగర్: గుజరాత్లో మే 16 న జన్మించిన కవల శిశువులు కరోనాను ఓడించారు. వీరు మన దేశంలో మొట్టమొదటి కరోనా సోకిన కవల శిశువులు. వీరికి చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ చిన్నారులకు సువాస్, స్వర అని పేర్లు పెట్టారు. వీరి తల్లి కరోనా పాజిటివ్ కావడంతో పుట్టిన శిశువులకు కరోనా సోకింది. అయితే వైద్యుల చికిత్సతో తల్లీ పిల్లలు కరోనాను ఓడించారు. ఆ శిశువులకు ఇకపై ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.