గుజరాత్‌ వ్యాపారులకే దేశం తాకట్టు: సైదిరెడ్డి

ABN , First Publish Date - 2021-01-27T05:16:00+05:30 IST

గుజరాత్‌ వ్యాపారులకు దేశాన్ని తాకట్టు పెట్టేందుకు నూతన వ్యవసాయచట్టాలు చేశారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

గుజరాత్‌ వ్యాపారులకే దేశం తాకట్టు: సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌, జనవరి 26 : గుజరాత్‌ వ్యాపారులకు దేశాన్ని తాకట్టు పెట్టేందుకు నూతన వ్యవసాయచట్టాలు చేశారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. అదాని, అంబానీల కుటుంబాలకు మేలు చేసేందుకే చట్టాలు చేశారని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సస్పెండ్‌ చేయక తప్పదన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, కార్యదర్శి అమర్‌, చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, జక్కుల నాగేశ్వరరావు, కడియం వెంకటరెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, గూడెపు శ్రీనివాసు, బాజీవుల్లా పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:16:00+05:30 IST