కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ
ABN , First Publish Date - 2021-09-18T06:05:44+05:30 IST
పట్టణంలోని బీఎస్సాఆర్ పాఠశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి శుక్రవారం పరిశీలించారు
ధర్మవరంరూరల్, సెప్టెంబరు17: పట్టణంలోని బీఎస్సాఆర్ పాఠశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి శుక్రవారం పరిశీలించారు. ఆదివారం జరగ బోయే కౌంటింగ్ ఏర్పాట్లుపై ఆర్డీఓ రవీంద్రతో చర్చిం చారు. ముందుగా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి, కావాల్సిన సామాగ్రి వివరాలను తెలుసుకున్నారు. కౌం టింగ్ పక్రియను పారదర్శకంగా జరిగేలా చూడాలని, పొరపాట్లకు తావిస్తే చర్యలు తప్పవన్నారు. అదేవి ధంగా కౌంటింగ్పై డివిజన్లోని అన్ని మండలాల సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లుకు, రిటర్నంగ్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లుపై డీఎస్పీ రమాకాంత్, సీఐ కరుణాకర్లు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్ నీలకంఠారెడ్డి, ఎంపీడీఓ అశోక్కుమార్రెడ్డి పాల్గొన్నారు.