ధరల పెరుగుదల కాంగ్రెస్ దుష్ప్రచారమే: ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్

ABN , First Publish Date - 2021-08-25T15:00:37+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్...

ధరల పెరుగుదల కాంగ్రెస్ దుష్ప్రచారమే: ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మరోమారు చర్చల్లో నిలిచారు. దేశంలో ధరల పెరుగుదల అనేది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమేనని ఆరోపించారు. వీరు చెబుతున్నట్టు అది పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుల  కాదని, వారు చేస్తున్న తప్పుడు ప్రచారమేనన్నారు. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనా కాలంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కోసం పాత వాహనాలు వినియోగించి, వాయు కాలుష్యానికి కారకులయ్యారని ఆరోపించారు. నాటి రోజుల్లోని డీజిల్ వాహనాల్లో కూర్చున్న ప్రయాణీకుల ముఖం తుడుచుకుంటే ఆ రుమాల్ నల్లగా మారిపోయేదన్నారు. అయినా అప్పటి ముఖ్యమంత్రి ఇవేవీ పట్టించుకునేవారు కాదన్నారు. 

Updated Date - 2021-08-25T15:00:37+05:30 IST