దేశంలో 20కి చేరిన ‘కరోనా’ మరణాలు...727 మందికి వైరస్

ABN , First Publish Date - 2020-03-27T13:53:11+05:30 IST

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య పెరుగుతోంది.....

దేశంలో 20కి చేరిన ‘కరోనా’ మరణాలు...727 మందికి వైరస్

న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క గురువారం రోజే కొవిడ్-19తో  ఏడుగురు రోగులు మరణించారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజే మరో 71 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో నాలుగు కొత్త కరోనా కేసులు బయటపడటంతో దేశంలో కొవిడ్-19 పాజిటివ్ రోగుల సంఖ్య 727కు పెరిగింది. కరోనా రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. 

Updated Date - 2020-03-27T13:53:11+05:30 IST