నేటి నుంచి Hyderabad వ్యాప్తంగా రెండో డోస్..
ABN , First Publish Date - 2021-11-22T14:45:10+05:30 IST
గ్రేటర్ వ్యాప్తంగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి
హైదరాబాద్ సిటీ : గ్రేటర్ వ్యాప్తంగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభిస్తునట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 4,846 కాలనీలలో గతంలో మొదటి డోస్ పూర్తి చే శారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ను పెద్దఎత్తున నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాలనీల్లో, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో, బస్తీ దవాఖానాల్లో రెండో డోస్ వ్యాక్సిన్ వేయనున్నారు. డ్రైవ్లో భాగంగా ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి జాబితాను గుర్తించి మరుసటి రోజు వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఆ తర్వాత ఆ ఇంటికి స్టిక్కర్ వేస్తారు.