కోవాక్సిన్ ట్రయల్స్ కోసం నిమ్స్, కేజీహెచ్ ఎంపిక
ABN , First Publish Date - 2020-07-04T03:50:37+05:30 IST
కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ మరో ముందడుగు వేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కరోనా టీకా
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ మరో ముందడుగు వేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కరోనా టీకా ‘కోవాక్సిన్’ను త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ (బీబీబీ152) క్లినికల్ ట్రయల్స్ కోసం దేశ వ్యాప్తంగా 12 ఇనిస్టిట్యూషన్లు ఎంపిక చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించబడే అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు కాబట్టి క్లినికల్ ట్రయల్స్ను పెంచాలని ఐసీఎంఆర్ ఈ సంస్థలను కోరింది. తెలుగు రాష్ట్రాల్లో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం నిమ్స్, కేజీహెచ్ను ఎంపిక చేశారు. నిమ్స్లో క్లినికల్ ట్రయల్స్ కోసం నోడల్ ఆఫీసర్గా ప్రభాకర్రెడ్డి నియమించారు. అదేవిధంగా కేజీహెచ్లో క్లినికల్ ట్రయల్స్ కోసం నోడల్ ఆఫీసర్గా డా.వాసుదేవ్ను నియమించారు. కాగా అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15 నాటికి దేశంలో తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.