కరోనా టెస్ట్‌ ధర రూ.350

ABN , First Publish Date - 2022-01-22T04:47:24+05:30 IST

జిల్లాలోని ఆసుపత్రులు, ల్యాబ్‌లు ప్రభుత్వం ఆమోదించిన రేట్ల ప్రకారమే కరోనా పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రమణ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా టెస్ట్‌  ధర రూ.350

రింగురోడ్డు, జనవరి 21: జిల్లాలోని ఆసుపత్రులు, ల్యాబ్‌లు ప్రభుత్వం ఆమోదించిన రేట్ల ప్రకారమే కరోనా పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రమణ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని చార్జీలతో సహా, కొవిడ్‌ పరీక్ష ధరను ప్రభుత్వం రూ.350 నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందులో  స్ర్కినింగ్‌, కన్ఫర్మటరీ టెస్ట్‌లు ఉంటాయన్నారు. జిల్లా లోని అన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లు ధరలు కనిపించే రీతిలో బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ ధరలకు వ్యతిరేకంగా  అధికంగా వసూలు చేస్తే ఐసీఎంఆర్‌ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. 


 

Updated Date - 2022-01-22T04:47:24+05:30 IST