కరోనా నిబంధనలను పాటించాలి: దుబ్బాక ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-09T06:20:00+05:30 IST

ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ, కరోనా కట్టడి చేయడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు సూచించారు.

కరోనా నిబంధనలను పాటించాలి: దుబ్బాక ఎమ్మెల్యే
దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే

దుబ్బాక/మిరుదొడ్డి,మే 8: ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ, కరోనా కట్టడి చేయడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు సూచించారు.  శనివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిరుదొడ్డి మండలంలోని రుద్రారం, వీరారెడ్డిపల్లి, అల్వాల్‌, జంగపల్లి, అల్మా్‌సపూర్‌ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలను తీసుకుంటూ, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రభుత్వం కొవిడ్‌పై ఇంటింటి సర్వేనిర్వహించడం జరుగుతుందని, ఈసర్వేకు ప్రజలు సహకరించాలని తెలిపారు. అంతకు ముందు దుబ్బాకలో ఏర్పాటు చేసిన బాబుజగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి ఎమ్మెల్యే ఆ సంఘం నాయకులకు రూ. 50వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డిపల్లి గ్రామసర్పంచు వెంకట్‌రెడ్డి, బీజేపీ నాయకులు బిక్షపతి, నర్సింహ్మారెడ్డి, బాలే్‌షగౌడ్‌, దేవరాజు, మల్లేశం, విభూషన్‌రెడ్డి తదితరులున్నారు.  

Updated Date - 2021-05-09T06:20:00+05:30 IST