కరోనా బాధితులు చొరబడకుండా ఆరు గస్తీ నౌకలతో నిఘా
ABN , First Publish Date - 2020-04-03T13:59:56+05:30 IST
కరోనా బాధితులు, స్మగ్లర్లు భారత సముద్రతీరంలో చొరబడకుండా రామేశ్వరం తీరంలో
చెన్నై : శ్రీలంక నుంచి కరోనా బాధితులు, స్మగ్లర్లు భారత సముద్రతీరంలో చొరబడకుండా రామేశ్వరం తీరంలో ఆరు నౌకలతో గస్తీ ఏర్పాటు చేశారు. ఈ నౌకలతోపాటు విమానాలు, హెలికాప్టర్లు కూడా సంచరిస్తూ కరోనా బాధితులు రాకుండా అడ్డుకుం టున్నాయి. రామనాథపురం జిల్లా రామేశ్వరం దీవికి చేరువులో శ్రీలంక ఉంది. శ్రీలంకలోనూ ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరు గుతోంది. అక్కడి నుంచి కరోనా సోకినవారు గానీ, స్మగ్లర్లు గానీ భారత సరిహద్దుల్లో చొరబడకుండా ఉండేందుకు ఆరు నౌకలతో గస్తీ ఏర్పాటు చేశారు.
పాక్ జల సంధి ప్రాంతం, మం డపం నుంచి పాంబన్ దాకా, రామే శ్వరం, ధనుష్కోడి తీరం పొడవునా భారత నావికాద ళానికి చెందిన నౌక, కోస్ట్గార్డ్కు చెందిన ఐదు నౌకలు, ఓ విమానం, హెలి కాప్టర్ సంచరిస్తున్నాయి. శ్రీలంక నుంచి శరణార్థుల ముసుగులో కరోనా వైరస్ బాధితులు భారత సముద్రతీరంలో చొరబడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలి జెన్స్ అధికారులు రహస్య సమాచారం అందించడంతో ఈ నౌకలతో రామేశ్వరం తీరం పొడవునా గస్తీ ముమ్మరం చేసినట్టు నావికాదళం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.