సెప్టెంబరు మధ్య కల్లా భారత్‌లో కరోనా ఖతం

ABN , First Publish Date - 2020-06-07T08:28:17+05:30 IST

సెప్టెంబరు మధ్య కల్లా భారత్‌లో కరోనా ఖతం

సెప్టెంబరు మధ్య కల్లా భారత్‌లో కరోనా ఖతం

  • కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల అంచనా 


న్యూఢిల్లీ, జూన్‌ 6 : సెప్టెంబరు రెండోవారం కల్లా దేశంలో కరోనా మహమ్మారి తోక ముడుస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో కొవిడ్‌ కేసులకు సంబంధించి మార్చి 1 నుంచి మే 19 కాలపు గణాంకాల ను బైలీ మేథమెటికల్‌ మోడల్‌లో విశ్లేషించగా ఈవిషయం తేలిందన్నారు. ఇన్ఫెక్షన్‌ సోకిన వారి సంఖ్య.. కోలుకున్నవారు, మరణించిన వారి సంఖ్య సమాన స్థాయికి చేరితే వైరస్‌ వ్యాప్తి మలిదశకు చేరినట్టుగా భావించాల్సి ఉంటుందన్నారు. ఈ అధ్యయన నివేదికను కేంద్ర ఆరోగ్యశాఖలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌(పబ్లిక్‌ హెల్త్‌) అనిల్‌ కుమార్‌, డిప్యూటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(లెప్రసీ) రూపాళీ రాయ్‌ రూపొందించా రు. ఈ వివరాలు ‘ఎపిడెమియాలజీ ఇంటర్నేషనల్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

Updated Date - 2020-06-07T08:28:17+05:30 IST