కరోనా సోకినా వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న సమాజం

ABN , First Publish Date - 2020-07-12T15:46:36+05:30 IST

కరోనా వైరస్‌తో ప్రపంచ జనాభా అల్లాడిపోతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య..

కరోనా సోకినా వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న సమాజం

కరోనా వైరస్‌తో ప్రపంచ జనాభా అల్లాడిపోతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుందేగానీ తగ్గడంలేదు. ఇక సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు వైరస్‌తో పోరాడి జయించినవారూ ఉన్నారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అన్నట్టుగా ఉంది. కరోనా సోకిందంటే మానసికంగా కృంగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


దేశంలో కోవిడ్ ఉధృతి ప్రారంభమైనప్పటి నుంచి పోరాడాల్సింది కరోనాతో.. వ్యక్తితో కాదన్న మాటలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. వైరస్ సోకిన నాటినుంచి మృతుల అంత్యక్రియల వరకు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మానవత్వం మంట కలిసిందా? అన్న సందేహం కలుగుతోంది. వైరస్ సోకినవారు అనారోగ్యంతో బాధపడుతుంటే సమాజం ప్రవర్తిస్తున్న తీరుతో మరింత కృంగిపోతున్నారు.

Updated Date - 2020-07-12T15:46:36+05:30 IST