అప్రమత్తం
ABN , First Publish Date - 2020-03-30T10:14:54+05:30 IST
జిల్లాలో కరోనా మహమ్మారినికి అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.
జిల్లాలో కరోనా మహమ్మారినికి అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు కావడంతో పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు జిల్లాలో కరోన అనుమానిత లక్షణాలతో వచ్చిన 97 మంది రోగుల నుంచి నమూనాలను సేకరించి నిర్థారణ కోసం పంపారు. వీటిలో 57 మందికి నెగిటివ్ ఫలితాలు వెలువడ్డాయి. మరో నలుగురికి కరోన సోకినట్లు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 36 మంది రోగుల ఫలితాలు అందాల్సి ఉంది. కరోన అనుమానిత లక్షణాలు ఉన్న వారిని, నిర్బంధంలో ఉండేందుకు అంగీకరించిన వారి కోసం జిల్లావ్యాప్తంగా 28 ప్రాంగణాల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అర్బన్లో విదేశాల నుంచి వచ్చిన 790 మందిపై ప్రత్యేక నిఘా ఉంచారు. జిల్లా నుంచి ఢిల్లీలోని సమ్మేళనానికి ఎవరెవరు వెళ్ళారనే దానిపై పోలీసు వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మత సంస్థ పెద్దలు, రైల్వే రిజర్వేషన్ ద్వారా కూడా ఆయా వివరాలను రాబడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా నుంచి సుమారు 45 మంది వెళ్ళినట్లు పోలీసు వర్గాలు వివరాలు సేకరించాయి.